
డాక్టర్ అఖిలేష్ ఏం చెబుతున్నారంటే.. ఈ రకమైన కండరాల నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం ప్రధాన కారణాలలో ఒకటి. సరైన భంగిమ లేకపోవడం వల్ల కండరాల నొప్పి వస్తుంది. ల్యాప్టాప్లు లేదా ఫోన్లపై పనిచేసేటప్పుడు నిరంతరం మెడను వంచడం వల్ల వీపుపై ఒత్తిడి వస్తుంది. ఇది కూడా నొప్పికి దారితీస్తుంది. అలాగే విటమిన్లు డి, కాల్షియం స్థాయిలు అసాధారణంగా ఉన్నప్పటికీ ఈ నొప్పి తగ్గకుండా ఉంటుంది.
కొన్నిసార్లు మానసిక ఒత్తిడి పరోక్షంగా కండరాల నొప్పికి కారణమవుతుంది. మానసిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది కండరాలను నిరంతరం ఉద్రిక్తంగా ఉంచడం ద్వారా నొప్పిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడితో పాటు తగినంత నిద్ర లేకపోవడం కూడా నొప్పికి కారణమవుతుంది.
విటమిన్ లోపం లేకపోయినా, శరీరంలో తగినంత నీటి శాతం లేకపోవడం వల్ల కూడా కండరాల నొప్పి వస్తుంది. నీళ్లు లేకపోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. ముఖ్యంగా ఎక్కువగా చెమట పట్టే వ్యక్తులు, అథ్లెట్లు ఈ విధమైన కండరాల నొప్పికి గురవుతారు. తగినంత కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్ తీసుకుంటున్నప్పటికీ డీహైడ్రేషన్ కండరాల నొప్పికి కారణమవుతుంది.
సరైన భంగిమలో కూర్చోవాలి. ఒక గంట కంటే ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం మానుకోవాలి.
రోజూ తేలికపాటి వ్యాయామం చేయడం మర్చిపోకూడదు.
రోజులో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి.
7 నుండి 8 గంటలపాటు నిద్ర పోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.