
కొంతమంది మంచం ఎంత మృదువుగా ఉన్నా , నేలపై పడుకోవడానికి ఇష్టపడతారు. పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా నేలపై హాయిగా నిద్రపోవడాన్ని మనం చాలా సార్లు చూసే ఉంటాం. చూశాము. ముఖ్యంగా ఈ వేసవిలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అలాంటి అలవాట్లను అలవర్చుకున్న వ్యక్తులు ఉండనే ఉంటారు. కొంతమందికి మంచం మీద పడుకున్నప్పుడు చేతులు, కాళ్ళలో నొప్పి వస్తుంది. కాబట్టి ఇలాంటివారు నేలపై హాయిగా నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ ఇది మంచి అలవాటేనా? కాదా? అనేది అందరినీ వేధించే ప్రశ్న. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నేల ఉపరితలం శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది. ఈ రకమైన అభ్యాసం వెన్నెముకను బలోపేతం చేయడానికి, వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అదనంగా, ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం ద్వారా అలసటను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా మనం నేలపై పడుకున్నప్పుడు, మన శరీరం నిటారుగా ఉంటుంది. ఇది శరీరాన్ని సడలించడమే కాకుండా కండరాలను కూడా సడలిస్తుంది. నొప్పి క్రమంగా తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.