ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ నీళ్లు తాగితే…డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకున్నట్టేనా?
ప్యాక్ చేసిన నీళ్లే... ఇప్పుడు మనం ప్రాణాలు తీసే ప్రమాదం ఉందంటున్నాయి పరిశోధనలు. ఈ క్షణం వరకు అవే సురక్షితం అనుకొని డబ్బిచ్చి మరీ కొనుక్కొని తాగుతున్న నీళ్లు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కాస్త లోతుల్లోకెళ్లి గణాంకాలను పరిశిలీస్తే.. ఇప్పుడు మనం ఈ ప్యాక్ చేసిన నీళ్ల సీసాలకు పూర్తిగా అలవాటు పడిపోయామన్న విషయం అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం చెయ్యాల్సిందేంటి?

హోటెల్కెళ్లి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్ … పెళ్లికెళ్లి భోజనం చేస్తే వాటర్ బాటిల్ …. బస్సులో కావచ్చు.. ట్రైన్లో కావచ్చు… ట్రావెల్ చేస్తే వాటిర్ బాటిల్. సెమినార్లో బాటిల్.. మీటింగ్లో వాటర్ బాటిల్… ఎక్కడ చూసినా నీళ్లు తాగాలంటే బాటిల్ ఉండాల్సిందే! పైపెచ్చు.. గ్లాసులో నీళ్లు తాగితే నామోషీ… వాటర్ బాటిల్ సీల్ తీసి నీళ్లు తాగితే గొప్ప. ఈ భావన ఆల్రెడీ మన మైండ్లలో సెటప్ అయిపోయింది. ఇప్పట్లో దాన్నుంచి బయటపడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకేనేమో… ప్రపంచ వ్యాప్తంగా కేవలం ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ బిజినెస్ సుమారు 21 లక్షల కోట్లకు చేరిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్శిటీ, రట్గర్స్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో నివ్వెర పోయే వాస్తవాలు బయటపడ్డాయి. ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలో నీళ్లు తాగడం అంటే డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకోవడమేనని తేల్చారు. ప్రతి లీటర్ నీటిలో సుమారు 2 లక్షల 40 వేల నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తేల్చారు. నిజానికి ఇవి గతంలో ఊహించిన వాటికన్నా సుమారు 10 నుంచి 100 రెట్లు ఎక్కువ. వీరి పరిశోధన అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ప్రచురితమైంది. ఏమిటీ నానో ప్లాస్టిక్స్? నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్ర మైన అనారోగ్య సమస్యలు...




