Fruits For Diabetics: షుగర్ రోగుల కోసం సూపర్ ఫ్రూట్స్.. ఇవి రోజూ తింటే మధుమేహం మాయం!

|

Mar 24, 2023 | 11:33 AM

కొన్ని రకాల పండ్లు తింటే మీ షుగర్ అదుపులో ఉంటుందని మీకు తెలుసా? అవునండీ.. రక్తంలో చక్కెర పెరుగుదల గురించి అస్సలు ఆలోచించకుండా ఎంచక్కా వాటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Fruits For Diabetics: షుగర్ రోగుల కోసం సూపర్ ఫ్రూట్స్.. ఇవి రోజూ తింటే మధుమేహం మాయం!
Super foods For Diabetes
Follow us on

మధుమేహం మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. శారీరక శ్రమలేని జీవన శైలి, ఆహార అలవాట్లు తదితర కారణాలు వల్ల ఏటేటా షుగర్ వ్యాధి గ్రస్తులు పెరుగుతున్నారు. అయితే దీనిని తొలి దశలోనే గుర్తించి, సరైన చికిత్సతో పాటు జీవనశైలిని మార్చుకుని, వైద్యుల సిఫార్సుల మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. పైగా అన్ని రకాల ఆహార పదార్థాలు, పండ్లు తినలేని పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని రకాల పండ్లు తింటే మీ షుగర్ అదుపులో ఉంటుందని మీకు తెలుసా? అవునండీ.. రక్తంలో చక్కెర పెరుగుదల గురించి అస్సలు ఆలోచించకుండా ఎంచక్కా వాటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 షుగర్ వ్యాధి గ్రస్తులకు అవి సూపర్ ఫ్రూట్స్ అట. ఆ సూపర్ ఫ్రూట్స్ ఏంటో చూద్దాం రండి..

డ్రాగన్ ఫ్రూట్.. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మొత్తం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది 48 నుండి 52 మధ్య చాలా తక్కువ జీఐ(గ్లైసెమిక్ ఇండెక్స్) స్కోర్‌ను కలిగి ఉంది. ఇది మధుమేహం నిర్వహణకు ఆదర్శవంతమైన పండు. ఈ పండు ఒక సర్వింగ్ లో 8 నుంచి 9 గ్రాముల చక్కెరను మాత్రమే అందిస్తుంది. ఇది అధిక పోషకాలు, తక్కువ కేలరీలు కలిగిన పండు.

బొప్పాయి.. దీనిలో మీడియం జీఐ ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సురక్షితంగా తినవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగిస్తుందని కొన్ని నివేదికలు సూచించాయి. బొప్పాయిలోని సహజ యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

జామున్ లేదా ఇండియన్ బ్లాక్‌బెర్రీ.. ఈ పండు డయాబెటిక్-ఫ్రెండ్లీగా బాగా ప్రాచుర్యం పొందింది. దాని ఆకులు, గింజలు లేదా లోపలి గుజ్జును తినవచ్చు. ఈ పండు అలాగే చెట్టులోని ప్రతి భాగం మధుమేహం చికిత్సకు ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహం చికిత్స కోసం ఆయుర్వేదంలో జామున్ యొక్క పొడి విత్తనాలను సిఫార్సు చేస్తారు . ఇది కార్బోహైడ్రేట్లను శక్తిగా మారుస్తుంది, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జామున్ పండు తక్కువ జీఐ కలిగి ఉంటుంది. తరచుగా మూత్రవిసర్జన వంటి మధుమేహ లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

కివి.. ఇది ఒక మోడరేట్ జీఐతో తక్కువ చక్కెర కలిగిన పండు. ఇది తక్కువ కేలరీలు, పోషకాలు కలిగిన పండు, ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కాదు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి, కివీ మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.

ఆపిల్.. దీనిలో ఫైబర్‌లో సమృద్ధిగా ఉంటుంది. ఫ్రక్టోజ్‌ను కలిగి ఉంటుంది. ఇది గ్లూకోజ్ కంటే మెరుగ్గా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కాదు. మధుమేహం ఉన్నవారు తమ షుగర్ లెవెల్స్‌ను పెంచుకోవడం గురించి చింతించకుండా వారి రోజువారీ ఆహారంలో ఒక మోస్తరు పరిమాణంలో ఆపిల్‌లను సురక్షితంగా చేర్చుకోవచ్చు.

 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..