AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ ప్రియులకు హెచ్చరిక..! ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే మీ బాడీ షెడ్డుకే..

టీ మనశ్శాంతిని అందిస్తుంది. చురుకుదనాన్ని కూడా పెంచుతుంది. అయితే, టీతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహారాలను టీతో పాటు తీసుకోవడం వల్ల పోషకాల శోషణ తగ్గుతుంది. కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

టీ ప్రియులకు హెచ్చరిక..! ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే మీ బాడీ షెడ్డుకే..
Foods To Avoid With Tea
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2025 | 8:39 AM

Share

టీ అనేది ప్రతి భారతీయుడి దైనందిన జీవితంలో అంతర్భాగం. పార్టీ అయినా, షాపింగ్‌ అయినా, ఇంట్లో అయినా, ఆఫీసులోనైనా చాలా మంది ఒక కప్పు వేడి టీ లేకుండా తమ రోజు అసంపూర్ణంగా ఉంటుందని భావిస్తారు. టీ మనశ్శాంతిని అందిస్తుంది. చురుకుదనాన్ని కూడా పెంచుతుంది. అయితే, టీతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహారాలను టీతో పాటు తీసుకోవడం వల్ల పోషకాల శోషణ తగ్గుతుంది. కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదకరమైన వ్యాధులకు కూడా దారితీయవచ్చునని చెబుతున్నారు. అలాంటి ఆహారాలేంటో ఇక్కడ చూద్దాం..

మొదటిది శనగ పిండితో చేసిన ఆహారాలు బజ్జీలు, పకోడీలు వంటివి టీతో తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కలయిక జీర్ణ సమస్యలు, ఆమ్లత్వం, అజీర్ణానికి దారితీస్తుంది. అందువల్ల, అతిథులకు వడ్డించే టీ-బేసాన్ పదార్థాలను వెంటనే తినకుండా ఉండటం మంచిది.

మరో ఆహార పదార్థం నిమ్మకాయ. కొంతమంది టీలో నిమ్మకాయను కలిపి తాగుతారు. అయితే, నిమ్మకాయ దాని సిట్రస్ స్వభావం కారణంగా, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, టీ తాగేటప్పుడు నిమ్మకాయ లేదా దాని రసాన్ని తీసుకోకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

టీ తాగిన తర్వాత పసుపు తీసుకోవడం కూడా సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. పసుపు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. టీ ఆకులు, పసుపును కలిపి తీసుకోవడం హానికరం.

చాలా మందికి తెలియకుండానే, వేడి టీతో పాటు చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి. వేడి టీ తాగిన తర్వాత కనీసం అరగంట ఆగిన తరువాత మాత్రమే చల్లని ఆహారాలు తినాలి.

టీతో పాటు ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో ఇనుము స్థాయిలు తగ్గుతాయి. టీలోని టానిన్లు, ఆక్సలేట్లు ఇనుము శోషణను నిరోధిస్తాయి. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారంలో ఇలాంటివి ఎక్కువగా కలుగుతాయి. అందువల్ల, టీ తాగేటప్పుడు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలనే నియమాన్ని పాటించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వేడి టీ మనశ్శాంతిని ఇచ్చినప్పటికీ, సరైన ఆహార కలయికతోనే మన శరీరం బలంగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..