Health Tips : ఫ్రూట్స్ తిన్నాక ఈ తప్పులు అస్సలు చేయకూడదు..! లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు..

|

Jul 28, 2021 | 1:52 PM

Health Tips : పండ్లలో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు పండ్లు తినమని సూచిస్తారు. ఒక వ్యక్తి రోజూ ఒక పండు తింటే శరీరానికి

Health Tips : ఫ్రూట్స్ తిన్నాక ఈ తప్పులు అస్సలు చేయకూడదు..! లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు..
Health Tips
Follow us on

Health Tips : పండ్లలో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు పండ్లు తినమని సూచిస్తారు. ఒక వ్యక్తి రోజూ ఒక పండు తింటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను పొందుతాడు. కానీ పండ్లు తిన్న తరువాత చాలా సార్లు మనం వాటర్ తాగి పొరపాటు చేస్తాం. దీనివల్ల పండు ప్రయోజనం శరీరానికి అందదు. అంతేకాదు శరీరానికి హాని కలుగుతుంది. అందుకే పండ్లు తినడానికి సరైన మార్గాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు.

1. పండులో సహజ చక్కెర ఉంటుంది. అందువల్ల పండ్లతో ఏదైనా తినడం లేదా తాగడం మంచిది కాదు. ఇది కాకుండా పండ్లలో ఈస్ట్ కనిపిస్తుంది ఇది కడుపులో ఆమ్లాన్ని కలిగిస్తుంది. నీరు తాగడం వల్ల కడుపులో ఆమ్ల పరిమాణం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి.

2. పండ్లలో 80 నుంచి 90 శాతం నీరు ఉంటాయి. అందువల్ల శరీరానికి అదనపు నీరు అవసరం లేదు. కానీ మీరు పండు తిని నీరు తాగితే వాంతులు లేదా విరేచనాలు కలుగుతాయి.

3. పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే నీరు ఆహారాన్ని జీర్ణం చేసే ఆమ్లం ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆమ్లత్వం, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

పండు తినడానికి సరైన మార్గం ఏమిటి
పండ్లు తినడానికి సరైన మార్గం ఏమిటంటే 45 నిమిషాల ముందు, పండు తిన్న 45 నిమిషాల తరువాత ఏమి తినకూడదు లేదా తాగకూడదు. ఎందుకంటే పండు పూర్తి ఆహారంగా పనిచేస్తుంది. పండ్లలో మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. పూర్వ కాలంలో కొంతమంది పండ్లు తినడం ద్వారా మాత్రమే తమ జీవితాన్ని గడిపేవారు. మీరు పండును సరిగ్గా తింటుంటే దానిలోని అన్ని పోషకాలను మీరు సరైన మార్గంలో పొందుతారు. కానీ ద్రాక్ష, నారింజ, మొసాంబి మొదలైన సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తినవద్దు ఆమ్లత్వం సమస్య ఉండవచ్చు.

రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటున్నారా..! అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

APVVP Recruitment: కడప ఏపీవీవీపీలో పీడియాట్రీషియన్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం పొందే అవకాశం..

okyo Olympics 2021: 10 గోల్డ్ మెడల్స్‌తో పతకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో జపాన్.. మరి భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..