
పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి.. ఈ మూడింటి కలయికతో చేసే మసాలా పేస్ట్ ఈ వంటకానికి ప్రాణం పోస్తుంది. పుదీనా అన్నంలో కూరగాయలు వేయాలా వద్దా? బాస్మతి బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలి? సోనా మసూరి వాడితే కొలతలు ఎలా ఉండాలి? కేవలం పది నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం వెనుక ఉన్న చిన్న చిన్న కిటుకులు ఏంటి? ఈ రెసిపీలో చూసేయండి..
కావలసిన పదార్థాలు..
బియ్యం: 1 కప్పు (బాస్మతి లేదా సోనా మసూరి)
పుదీనా ఆకులు: ¾ కప్పు (తాజావి)
కొత్తిమీర ఆకులు: ¼ కప్పు
పచ్చి కొబ్బరి తురుము: ⅓ కప్పు
పచ్చిమిర్చి: 1 నుండి 2
అల్లం: ¾ అంగుళం ముక్క (తొక్క తీసినది)
వెల్లుల్లి రెబ్బలు: 2 (మధ్యస్థ పరిమాణం)
నెయ్యి లేదా నూనె: 1½ నుండి 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: ⅓ టీస్పూన్
కరివేపాకు: ఒక రెబ్బ
మసాలా దినుసులు:
స్టార్ అనైస్ (అనాస పువ్వు) – 1
లవంగాలు – 3 నుండి 4
దాల్చిన చెక్క – 1 అంగుళం ముక్క
పచ్చి యాలకులు – 2 నుండి 3
జాపత్రి – చిన్న ముక్క
జీడిపప్పు: 10 నుండి 15 (తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా (సుమారు ⅓ టీస్పూన్)
నీరు: బియ్యం రకాన్ని బట్టి (1½ నుండి 2 కప్పులు)
కూరగాయలు (ఆప్షనల్): 1 కప్పు (బంగాళదుంప, క్యారెట్, బఠానీలు, బీన్స్)
తయారీ విధానం..
ముందుగా ఒక కప్పు బియ్యాన్ని కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
ముప్పావు కప్పు పుదీనా, పావు కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు మరియు 1/3 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
కుక్కర్లో నెయ్యి లేదా నూనె వేసి జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీడిపప్పు వేసి వేయించాలి.
సిద్ధం చేసుకున్న పుదీనా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు 3-4 నిమిషాలు వేయించాలి. కావాలనుకుంటే క్యారెట్, బఠానీలు కూడా చేర్చుకోవచ్చు.
బాస్మతి బియ్యానికి: 1 కప్పు బియ్యం = 1.5 కప్పుల నీరు.
1 కప్పు బియ్యం = 2 కప్పుల కంటే కొంచెం ఎక్కువ నీరు.
ఎసరు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి, ఉప్పు చూసుకుని మూత పెట్టాలి. బియ్యం ఉడికిన తర్వాత 5 నిమిషాల ఆగి వడ్డించాలి.
ఈ పుదీనా అన్నాన్ని ఉల్లిపాయ రైతా లేదా బంగాళదుంప కుర్మాతో తింటే ఆ రుచే వేరు! లంచ్ బాక్స్కు ఇది నిజంగా ఒక అద్భుతమైన ఛాయిస్.
పుదీనా ఆకులు మరీ ఎక్కువగా వేస్తే అన్నం కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి పైన చెప్పిన కొలతలను పాటిస్తే పర్ఫెక్ట్ రుచి వస్తుంది.