Sugar Control Rice: షుగర్ పేషెంట్లకు ఈ బియ్యం వరం.. అస్సలు మిస్ చేయకండి!

ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటీస్‌తో బాధ పడుతూ ఉంటున్నారు. చిన్నా, పెద్దా అనే వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్‌తో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటీస్ పేషెంట్లు ఏం తినాలన్నా భయంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకు కారణం.. కొద్దిగా తిన్నా సరే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పే బియ్యం చాలా చక్కగా ఉపయోగ పడతాయి. సాంబ మసూరి అనే సన్న బియ్యాన్ని షుగర్ పేషెంట్లు..

Sugar Control Rice: షుగర్ పేషెంట్లకు ఈ బియ్యం వరం.. అస్సలు మిస్ చేయకండి!
Sugar Control Tips

Updated on: Jun 01, 2024 | 2:08 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటీస్‌తో బాధ పడుతూ ఉంటున్నారు. చిన్నా, పెద్దా అనే వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్‌తో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటీస్ పేషెంట్లు ఏం తినాలన్నా భయంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకు కారణం.. కొద్దిగా తిన్నా సరే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పే బియ్యం చాలా చక్కగా ఉపయోగ పడతాయి. సాంబ మసూరి అనే సన్న బియ్యాన్ని షుగర్ పేషెంట్లు తినడం వల్ల.. చక్కెర లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతుంది. సాంబ మసూరి బియ్యం డయాబెటీస్ నియంత్రణకు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలను స్లోగా పెంచుతుంది. కేవలం షుగర్ మాత్రమే కాకుండా.. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. మరి ఈ సాంబ మసూరి బియ్యం తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? డయాబెటీస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు మెండు:

సాంబ మసూరి బియ్యంలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్ లభిస్తాయి. ఈ పోషకాలు అన్నీ డయాబెటిక్ కాంప్లికేషన్ల తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

రక్తంలో షుగర్ లెవల్స్‌ తగ్గిస్తుంది:

సాంబ మసూరి రైస్ తినడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో జీఐ అంటే రక్తంలో షుగర్ లెవల్స్‌లను వేగంగా పెంచకుండా చూస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు ఈ బియ్యం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫైబర్ అధికం:

సాంబ మసూరి రైస్‌లో ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను, రక్త పోటును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయ పడుతుంది. ఈ రైస్ కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి.. బరువు కూడా తగ్గొచ్చు.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది:

సాంబ మసూరి బియ్యం తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఈ రైస్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అలాగే రక్త పోటును కూడా నియంత్రిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. ఈ రైస్ తినడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..