Parenting Tips: చంటి బిడ్డకు పాలు పడుతూ ఫోన్ వాడుతున్నారా? అయితే మీ పిల్లవాడి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్లే…

స్త్రీ జీవితంలో గర్భం దాల్చడం ఎంత ముఖ్యమో...ప్రసవం తర్వాతి రోజులు కూడా అంతే ముఖ్యం. ప్రసవం తర్వాత కూడా స్త్రీ తన ఆరోగ్యంతోపాటు తన బిడ్డ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి.

Parenting Tips: చంటి బిడ్డకు పాలు పడుతూ ఫోన్ వాడుతున్నారా? అయితే మీ పిల్లవాడి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్లే...
Parenting Tips

Edited By:

Updated on: Mar 25, 2023 | 2:42 PM

స్త్రీ జీవితంలో గర్భం దాల్చడం ఎంత ముఖ్యమో…ప్రసవం తర్వాతి రోజులు కూడా అంతే ముఖ్యం. ప్రసవం తర్వాత కూడా స్త్రీ తన ఆరోగ్యంతో పాటు తన బిడ్డ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా తొలినాళ్లలో శిశువు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. నవజాత శిశువు ఆరోగ్యానికి తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. అయితే తల్లి పాలు పిల్లలకు సరిగ్గా ఉంటేనే వారి ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

మహిళలు గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం చాలా బిజీగా మారుతారు. ప్రసవం తర్వాత పిల్లల పెంపకానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. అందుకే చాలా మంది మహిళలకు వ్యక్తిగత సమయం లభించదు. అయితే కొంతమంది తల్లులు బిడ్డకు పాలిచ్చేటప్పుడు మొబైల్ వాడుతుంటారు. పాలిచ్చే సమయంలో మొబైల్ ఫోన్ వాడటం వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

పాలిచ్చే సమయంలో మొబైల్ ఉపయోగించడం సరైంది కాదు:

ఇవి కూడా చదవండి

శిశువులకు పాలిచ్చే సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి తల్లులకు సమయం ఉండదు. కొన్నిసార్లు శిశువు పాలు తాగుతుంటే తల్లులు ఫోన్ వాడుతుంటారు. ఇది ఏమాత్రం సరైంది కాదని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని సలహా ఇస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, మరోవైపు తల్లి పాలివ్వడంలో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం బిడ్డపై తల్లి దృష్టిని, తల్లి శారీరక ఉత్తేజాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు.

తల్లి పాలివ్వడంలో స్మార్ట్‌ఫోన్ వాడకం తల్లి భంగిమ, బిడ్డతో కమ్యూనికేషన్‌పై ప్రభావం చూపుతుంది. దీని వల్ల తల్లికి వెన్ను నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. మొబైల్ వాడకం వల్ల తల్లులకు పిల్లలతో కమ్యూనికేషన్ తగ్గిపోతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఇది శిశువు సున్నితంగా స్పందించే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. తద్వారా పిల్లలలో ఒత్తిడిని కలిగిస్తుంది. అంతేకాదు జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

మొబైల్ వాడకం తల్లి-శిశువు పరస్పర చర్యను ప్రభావితం చేస్తుంది:

నర్సింగ్, హెల్త్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం పాలు ఇస్తున్నప్పుడు తల్లి స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని, తల్లి-శిశువుల పరస్పర చర్యల నాణ్యతపై దాని ప్రభావాన్ని పరిశీలించింది. స్మార్ట్ ఫోన్ వాడకుండా పాలు తాగుతున్న తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పరిశీలించారు. తల్లి-శిశువు కమ్యూనికేషన్ నాణ్యతను అంచనా వేయడానికి, మదర్-ఇన్‌ఫాంట్ సెన్సిటివిటీ అసెస్‌మెంట్ జపనీస్ సవరించిన సంస్కరణ ఉపయోగపడింది. తల్లిపాలు ఇచ్చే సమయంలో స్మార్ట్‌ఫోన్ వాడకం బిడ్డ ప్రతిచర్య సమయాన్ని, తల్లి పట్ల శ్రద్ధను ప్రభావితం చేస్తుందని కనుగొనబడింది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us