
ఎక్కువ కాలం జీవించాలనేది ప్రతీ ఒక్కరి కోరిక. అయితే అది ప్రకృతి విరుద్ధమని తెలిసిందే. మనిషికి నిత్య యవ్వనం అందని ద్రాక్షే. ఎప్పటికైనా వృద్ధాప్యం రావాల్సిందే. అయితే ఈ వృద్ధాప్య ఛాయలు రావడాన్ని వాయిదా వేయొచ్చా అంటే కచ్చితంగా అవునని పరిశోధకులు సమాధానం చెబుతున్నారు. సాధారణంగా హిమాలయాల్లో నివసించే స్వామిజీలు వందేళ్లకు పైగా జీవిస్తుంటారని మనం వినే ఉంటాం. అయితే వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, వచ్చే కొన్నేళ్లలో ఇది ప్రతీ ఒక్కరికీ దీర్ఘ ఆయుష్షు సాధ్యం కానుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆయుష్షును పెంచుకునేందుకు మనిషి తరతరాలుగా తహతహలాడుతున్నాడు. ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. హ్యూమన్ గ్రోత్ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని ఇప్పటికే పలు పరిశోధనలు నిర్థారించాయి. అటు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యంతో ఆయుష్షును కొంత మేర పెంచుకోవచ్చని అందరికీ తెలిసిందే. ఈ విషయంలో జీన్స్ కూడా దోహదపడుతాయి. వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేసేందుకు యాంటి ఏజింగ్ క్రీములు, సీరమ్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మనిషి 130 నుంచి 150 ఏళ్లు బతకడం పెద్ద కష్టామేమి కాదని, త్వరలోనే ఇది నిజం కాబోతోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పరిశోధకులు చెబుతోన్న ఈ కొత్త యాంటీ ఏజెంగ్ థెరపీ జీవిత కాలాన్ని 25 శాతం పెంచుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ...