గుడ్ న్యూస్ : ‘మై జీహెచ్‌ఎంసీ యాప్‌’తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు

|

Aug 02, 2020 | 8:26 AM

ఆస్తి ప‌న్ను బ‌కాయిదారులంద‌రికీ తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వన్‌టైం స్కీం(ఓటీఎస్‌) కింద బ‌కాయిలు క‌డితే ప‌లు ప్ర‌యోజ‌నాలు పొందే వెసులుబాటు క‌ల్పించింది.

గుడ్ న్యూస్ :  మై జీహెచ్‌ఎంసీ యాప్‌తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు
Follow us on

ఆస్తి ప‌న్ను బ‌కాయిదారులంద‌రికీ తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వన్‌టైం స్కీం(ఓటీఎస్‌) కింద బ‌కాయిలు క‌డితే ప‌లు ప్ర‌యోజ‌నాలు పొందే వెసులుబాటు క‌ల్పించింది. ఇందుకు సంబంధించి ఓ జీవో కూడా జారీ చేసింది. జీవో 306 ప్రకారం 2019-20 సంవత్సరం వరకు బకాయి ఉన్న ఆస్తి పన్ను, వ‌డ్డీపై విధించిన 10 శాతం చెల్లించడం ద్వారా 90 శాతం రాయితీ పొందొచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్ తెలిపారు.

ఈ పథకాన్ని ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌, వెబ్‌సైట్‌లో అప్‌గ్రేడ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా ఇంటి నుంచే పేమెంట్స్ జరిపే వీలుంటుంద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఈ సౌక‌ర్యం ఉప‌యోగక‌రంగా ఉంటుందని వెల్ల‌డించారు. సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీసేవా కేంద్రాలతో పాటు బిల్‌ కలెక్టర్ల వ‌ద్ద చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చ‌ని తెలిపారు. దీని ద్వారా సిటీ పరిధిలో 5,41,010 మంది యజమానులకు ప్రయోజనం చేకూరనుందని కమిషనర్ వెల్ల‌డించారు.

 

Read More : ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల‌ వివరాలు