టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ముందే తెలుసు : వైసీపీ నేత సజ్జల

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమయిందో తెలియదు కానీ పోలింగ్ కు ఒకరోజు ముందే హైడ్రామాకు తెరలేపారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందనీ, టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ సర్వే అందిందని సజ్జల అన్నారు. దీంతో దాన్ని అడ్డుకునేందుకు, ప్రజలనుంచి సానుభూతి పొందేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం […]

టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ముందే తెలుసు : వైసీపీ నేత సజ్జల
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2019 | 1:35 PM

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమయిందో తెలియదు కానీ పోలింగ్ కు ఒకరోజు ముందే హైడ్రామాకు తెరలేపారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందనీ, టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ సర్వే అందిందని సజ్జల అన్నారు. దీంతో దాన్ని అడ్డుకునేందుకు, ప్రజలనుంచి సానుభూతి పొందేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు కూర్చోవాలనీ, ఆ తర్వాత తనను తీసుకెళ్లాలని పోలీసులకు చంద్రబాబు సూచించారని ఆరోపించారు.

2014లో జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అందరూ నమ్మారని వ్యాఖ్యానించారు. కానీ ఓటర్ తీర్పు వ్యతిరేకంగా వచ్చిందనీ, అప్పుడు జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. ఫలితాలు వచ్చిన 10 నిమిషాలకే మీడియా ముందుకు వచ్చి ప్రజాతీర్పును స్వీకరిస్తున్నామని జగన్  చెప్పారన్నారు. ఓ పరిణితి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం అదేనన్నారు. కానీ చంద్రబాబు తీరు అందుకు విరుద్ధంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.