ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా వైసీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా.. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి డొక్కా నామినేషన్ దాఖలు చేయడం, ఈ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండటం.. నామినేషన్ దాఖలకు ఇవాళే చివరి రోజు కావడంతో డొక్కా ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ.. జగన్ తనకు మంచి అవకాశం ఇచ్చారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
Read This Story Also: సుశాంత్ చివరి మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్