కేరళలో మహిళా పోలీసుపై దారుణం

| Edited By:

Jun 15, 2019 | 8:46 PM

కేరళలోని అలప్పుజ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అలువ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేసే అజాజ్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ సౌమ్యను వెనుక నుంచి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన ఆమె లేచి పరిగెత్తబోతుండగా.. చేతిలో కత్తి, పెట్రోల్ బాటిల్‌తో వెంబడించాడు. అనంతరం ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో ఆమె ప్రాణాలు వదిలింది. సౌమ్య భర్త సంజీవ్ విదేశాల్లో పని చేస్తుండగా.. ఈ […]

కేరళలో మహిళా పోలీసుపై దారుణం
Follow us on

కేరళలోని అలప్పుజ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అలువ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేసే అజాజ్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ సౌమ్యను వెనుక నుంచి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన ఆమె లేచి పరిగెత్తబోతుండగా.. చేతిలో కత్తి, పెట్రోల్ బాటిల్‌తో వెంబడించాడు. అనంతరం ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో ఆమె ప్రాణాలు వదిలింది. సౌమ్య భర్త సంజీవ్ విదేశాల్లో పని చేస్తుండగా.. ఈ దంపతులు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో అజాజ్‌కు కూడా గాయాలు అయ్యాయి. దీంతో అతణ్ని అలప్పుజ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.