పుణెలో కరోనా కలకలం.. ఒక్కరోజే కొత్తగా 1,803 కేసులు..

| Edited By:

Jul 10, 2020 | 11:00 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పుణెలో శుక్రవారం

పుణెలో కరోనా కలకలం.. ఒక్కరోజే కొత్తగా 1,803 కేసులు..
Follow us on

Pune: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పుణెలో శుక్రవారం రోజు కొత్తగా 1,803 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 34,399 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 978 మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న 581 మందిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు