క్యూనెట్ కేసులో సినీ హీరోలకు నోటీసులు
క్యూనెట్ వ్యవహరంలో 38 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ కేసు వివరాలను సజ్జనార్ మీడియాకు వివరించారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బెంగుళూరులోని విహాన్ కార్యాలయాన్ని కూడ సీజ్ చేసినట్టుగా ఆయన తెలిపారు. క్యూనెట్ సంస్థ రెండు రకాల అవతారాలతో ప్రజలను మోసగించిందన్నారు. ఇప్పటివరకు రూ. 5 వేల కోట్ల మేర మోసం జరిగిందని సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ కేసులో సినీ […]
క్యూనెట్ వ్యవహరంలో 38 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ కేసు వివరాలను సజ్జనార్ మీడియాకు వివరించారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బెంగుళూరులోని విహాన్ కార్యాలయాన్ని కూడ సీజ్ చేసినట్టుగా ఆయన తెలిపారు. క్యూనెట్ సంస్థ రెండు రకాల అవతారాలతో ప్రజలను మోసగించిందన్నారు. ఇప్పటివరకు రూ. 5 వేల కోట్ల మేర మోసం జరిగిందని సజ్జనార్ తెలిపారు.
క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకు కూడ నోటీసులు పంపినట్టుగా సజ్జనార్ వివరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా జరిగిన ఈ కుంభకోణంలో లక్షల్లో బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగుళూరులలో పలు కేసులు నమోదైనట్టుగా వివరించారు. 206(5) కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం విచారణ చేపడుతున్నామన్నారు.