AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు మీరే .. చంద్రబాబుపై విజయసాయి ఫైర్!

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు గారూ.. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్ పెట్టిన చరిత్రను మర్చిపోయారా.? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో చంద్రబాబు […]

హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు మీరే .. చంద్రబాబుపై విజయసాయి ఫైర్!
Ravi Kiran
|

Updated on: Jul 28, 2019 | 5:56 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు గారూ.. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్ పెట్టిన చరిత్రను మర్చిపోయారా.? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మద్యం నిషేదిస్తానని చెప్పి.. లిక్కర్ లాబీతో కుమ్మక్కై నిషేదాన్నే ఎత్తేశారు. కానీ జగన్ గారు దశల వారిగా మద్యంపై నిషేధం పెడతానంటే మతి భ్రమించి విమర్శలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.