టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్లో వార్ జరుగుతోంది. వ్యక్తిగత కక్షలతో జరుగుతున్న దాడులను వైసీపీకి అంటగడుతున్నారని టీడీపీపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. హింస, ఉన్మాద రాజకీయాలకు టీడీపీ పెట్టింది పేరు అని ఆరోపించారు. బందిపోట్లైనా కొన్ని వస్తువులు వదిలేస్తారని.. కాని కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని బతికేవారని అన్నారు. ఆఖరికి రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదని చెప్పారు.
ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు. కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారిని, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదు. రూ.15 లక్షల కంటే తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట. ముంబై దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 17, 2019