కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ. హనుమంతరావు ఏఐసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగకపోతే తానూ తన పదవిలో కొనసాగనని తేల్చి చెప్పారు. తమని నడిపించాల్సిన నాయకుడే బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇక కార్యకర్తల సంగతి ఏంటని ఆయన వాపోయారు. అందుకే తాను ఏఐసీసీ కార్యదర్శి పోస్టులో కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపించానని తెలిపారు. ఇప్పటి వరకు ఓటమికి బాధ్యత వహిస్తూ దాదాపు 200 మంది కీలక నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణాలో అయితే పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి రాజీనామాలు చేయగా, తాజాగా వీహెచ్ రాజీనామా చేశారు.