స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం..గత నెల రోజుల నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూన్నామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

|

Dec 24, 2020 | 10:03 PM

కొత్త రకం కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత నెల రోజుల నుంచే అన్ని...

స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం..గత నెల రోజుల నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూన్నామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Follow us on

కొత్త రకం కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత నెల రోజుల నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ వస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. కరోనా మళ్లీ విస్తరిస్తే లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్రాలదే నిర్ణయం అని స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి దాదాపు ఎనమిది నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా అనేక లక్షల మంది వైరస్‌తో పోరాడతున్నారు. టీకా వస్తే వైరస్‌కు చెక్‌ పెట్టొచ్చని అంతా భావిస్తున్న తరుణంలో కొత్త రకం కరోనా వైరస్‌ కోరలు తొడుక్కొని విస్తరిస్తుండటం భయాందోళన కలిగిస్తుంది. సెకండ్‌ వేవ్‌ వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు.

భారత్‌లోనూ యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కొత్తరకం వైరస్‌ను గుర్తించామని వైద్యులు తెలిపారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించేందుకు కసరత్తు చేస్తున్నాయి. గతంలో మాదిరిగా దేశమంతా లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు.