సరిహద్దుల్లో పాక్ గూఢచారుల అరెస్ట్

| Edited By:

May 29, 2019 | 10:41 AM

భారత్‌ – పాక్ సరిహద్దుల వెంట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను.. ఇవాళ తెల్లవారు జామున భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వారిని పాకిస్థాన్ కు చెందిన గూఢచచారులుగా అనుమానిస్తున్నారు. సరిహద్దు వెంట గస్తీ కాస్తున్న జవాన్లకు.. ఇద్దరు వ్యక్తులు సమీపంలోని ఆర్మీ స్థావరాలతో పాటు.. పరిసరాలను వీడియో తీస్తూ చిక్కారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన అధికారులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఒకరు కథువా, మరోకరు డొడా ప్రాంతానికి చెందిన […]

సరిహద్దుల్లో పాక్ గూఢచారుల అరెస్ట్
Follow us on

భారత్‌ – పాక్ సరిహద్దుల వెంట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను.. ఇవాళ తెల్లవారు జామున భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వారిని పాకిస్థాన్ కు చెందిన గూఢచచారులుగా అనుమానిస్తున్నారు. సరిహద్దు వెంట గస్తీ కాస్తున్న జవాన్లకు.. ఇద్దరు వ్యక్తులు సమీపంలోని ఆర్మీ స్థావరాలతో పాటు.. పరిసరాలను వీడియో తీస్తూ చిక్కారు.

దీంతో వారిని అరెస్ట్ చేసిన అధికారులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఒకరు కథువా, మరోకరు డొడా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వారి దగ్గర ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని.. పరిశీలించగా.. అరెస్ట్‌కు కొన్ని గంటల ముందు భారత్ లోని పలు ప్రాంతాలను కవర్ చేస్తూ వీడియోలను తీశారని.. అనంతరం వాటిని పాకిస్థాన్‌కు చెందిన కొంతమందికి పంపినట్లు తేలిందని తెలిపారు. అలాగే అక్కడి వారితో తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా వెల్లడైందని అధికారులు తెలిపారు.