AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్న లిఫ్టు

ఆర్థిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌లోని లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృత్యువాత పడ్డారు.

ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్న లిఫ్టు
Balaraju Goud
|

Updated on: Sep 24, 2020 | 12:49 PM

Share

ఆర్థిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌లోని లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృత్యువాత పడ్డారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరాన్ని ముంచెత్తింది. ఇదే క్రమంలో కాలాపాణీ ప్రాంతంలోని బిల్డింగ్ లోకి వరద నీరు వచ్చింది. దీంతో ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు బేస్‌మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ లిఫ్టులో వచ్చారు. అయితే, లిప్టు తలుపులు తెరుచుకోలేదు. బేస్‌మెంట్‌లో నిండిన నీరంతా లిఫ్టులోనికి ప్రవేశించి అది నిండిపోయింది. ఫలితంగా లిఫ్టులోని నీటిలో మునిగి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు.

ముంబైలోని కాలాపాణీ జంక్షన్ సమీపంలోని నైథానీ రెసిడెన్సీ అపార్టుమెంట్ కొన్నేళ్ల క్రితం నిర్మించారు. జమీర్ సోహనన్(32), షహజాద్ మేనన్(37) ఈ బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వారు బిల్డింగ్‌కు నీటిని సప్లయ్ చేసేందుకు బేస్‌మెంట్ దగ్గరున్న పంప్ దగ్గర స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లారు. అప్పటికే బేస్‌మెంట్‌ మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. దీంతో వారు లిప్టు నుంచి బయటకు రాకుండా, తలుపులు మూసివేశారు. తరువాత పైకి వెళ్లేందుకు లిఫ్టుకు కాల్ చేశారు. అయితే లిప్టు కదలలేదు. లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు లిఫ్టు అలారం మోగించారు. దానిని విన్న బిల్డింగ్‌లోని కొంతమంది ఆ లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, లిఫ్టు పైభాగాన్ని కట్ చేసి లోనికి వెళ్లేసరికి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నీటిలో మునిగిపోయారు. ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని పరిశీలించి, అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు