బెంగాల్లో కొనసాగుతున్న టెన్షన్.. నాటు బాంబులతో దాడి..
వెస్ట్ బెంగాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లా కంకినారా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. బాంబు దాడిలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని […]
వెస్ట్ బెంగాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లా కంకినారా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. బాంబు దాడిలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా కంకినారలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. బెంగాల్లో లోక్సభ ఎన్నికలప్పటి నుంచి హింసాత్మక వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే.