కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

| Edited By:

Mar 23, 2019 | 11:29 AM

శివమొగ్గ : కర్ణాటకలోని శివమొగ్గ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర తాలూకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్‌పిజి సిలిండర్లను తీసుకువెళుతున్న ట్రక్కు రోడ్డు నిర్మాణ సామగ్రిని తీసుకువెళుతున్న మరొక ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Follow us on

శివమొగ్గ : కర్ణాటకలోని శివమొగ్గ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర తాలూకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్‌పిజి సిలిండర్లను తీసుకువెళుతున్న ట్రక్కు రోడ్డు నిర్మాణ సామగ్రిని తీసుకువెళుతున్న మరొక ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.