దొంగలు రెచ్చిపోతున్నారు. దోపిడి చేయడానికి క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. పోలీసులకు సరికొత్త ఛాలెంజ్లు విసురుతున్నారు. తాజాగా దొంగతనం కోసం వినూత్న పద్ధతిని ఎంచుకుంది ఓ గ్యాంగ్. అంబులెన్స్లో వచ్చి చోరీకి యత్నించింది. ఈ సంఘటన కర్ణాటక బెంగళూరులోని జయనగర్ ఏరియాలో జరిగింది.
ఈనెల 1న అంబులెన్స్లో వచ్చిన ముగ్గురు దుండగులు ఉపకార్ డెవలపర్స్ కంపెనీలోకి చొరబడ్డారు. డోర్స్ పగలకొట్టి లోపలకు ప్రవేశించారు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా వాటికి రంగు పూశారు. అయితే, ఆ కంపెనీలో డబ్బు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఇలా అంబులెన్స్లో వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సిద్ధాపుర పోలీసులు.. కేసు నమోదు చేసుకుని… నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read :
కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్తో ఇద్దరు కూలీలు మృతి
Breaking : మళ్లీ గ్రే జాబితాలోనే పాకిస్థాన్ !