
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మధ్యంతర సమీక్ష నిర్వహిస్తున్నారు.. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు హాజరయ్యారు. 2020-2021 రాష్ట్ర బడ్జెట్పై అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై సైతం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్, యాదాద్రి కలెక్టర్, రోడ్లు భవనాలశాఖ అధికారులు, ఆలయ ఈవో హాజరుకానున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం..