
ఏపీ శాసనసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఉపనేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడిని నియమించగా.. టీడీపీ విప్గా వీరాంజనేయస్వామి వ్యవహరించనున్నారు. అటు శాసనమండలిలో టీడీపీపక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా మాణిక్యవరప్రసాద్, సంధ్యారాణి, శ్రీనివాసులను బాబు నియమించారు. మండలిలో టీడీపీ విప్గా బుద్ధా వెంకన్నను ఖరారు చేశారు.