స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి భూమికి, నాసా వ్యోమగాముల రిటర్న్ జర్నీ !

| Edited By: Pardhasaradhi Peri

Aug 02, 2020 | 3:59 PM

ఇంటర్నేషనల్ స్పేస్  స్టేషన్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) నుంచి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ రోదసి నౌక శనివారం మెల్లగా బయటకు వచ్చి దానితో విడిపోయింది. వ్యోమగాములు బాబ్ బెన్ కెన్, డగ్ హార్లేలతో కూడిన ఈ నౌక...

స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి భూమికి, నాసా వ్యోమగాముల రిటర్న్ జర్నీ !
Follow us on

ఇంటర్నేషనల్ స్పేస్  స్టేషన్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) నుంచి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ రోదసి నౌక శనివారం మెల్లగా బయటకు వచ్చి దానితో విడిపోయింది. వ్యోమగాములు బాబ్ బెన్ కెన్, డగ్ హార్లేలతో కూడిన ఈ నౌక…చీకటి పరచుకున్న స్పేస్ లో . క్రమంగా ఆ కేంద్రం నుంచి విడిపోతున్న (అన్ డాక్) దృశ్యం తాలూకు ఫుటేజీని నాసా రిలీజ్ చేసింది. వీరు రెండు నెలల పాటు అంతరిక్షంలో గడిపారు.  తుపాను కారణంగా వాతావరణం బాగా లేనప్పటికీ.. ఈ అంతరిక్ష నౌక భూమికి చేరుతోందని నాసా ట్వీట్ చేసింది.

‘క్యాప్స్యూల్ సేఫ్ ట్రాజెక్టరీ’లో ఉందని నాసా పేర్కొంది, ఫ్లోరిడా పశ్చిమ ప్రాంతంలో ఎస్ట్రోనట్లు దిగనున్నారు. తన బ్యాగేజీ అంతా సర్దుకున్నానని, ఇక బయలుదేరడానికి సిధ్ధంగా ఉన్నానని బాబ్ అంతకుముందు ట్వీట్ చేశాడు. గత మే 30 న వీరితో కూడిన అంతరిక్ష నౌక  నింగికి ఎగసింది.