నితీష్ కుమార్ పై చెప్పు విసిరిన దుండగులు, నలుగురి అరెస్ట్

| Edited By: Anil kumar poka

Oct 27, 2020 | 10:40 AM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కొంతమంది దుండగులు చెప్పు విసిరారు. ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ఆయన హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.

నితీష్ కుమార్ పై చెప్పు విసిరిన దుండగులు, నలుగురి అరెస్ట్
Follow us on

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కొంతమంది దుండగులు చెప్పు విసిరారు. ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ఆయన హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. చెప్పు ఆయనకు కొంత దూరంలో పడింది.  కాగా-పోలీసులు అప్రమత్తమై నలుగురిని అరెస్ట్ చేశారు. తన ఎన్నికల ప్రచార సభల్లో  నితీష్ కుమార్  చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ఆయన నిగ్రహాన్ని కోల్పోయి నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. తనకు ఓటు వేయకపోయినా బాధపడనని, కానీ ఈ విధమైన ఘటనలను సహించబోనని ఆయన అంటూ వచ్చారు.  ఓ ఎన్నికల ర్యాలీలో కొందరు లాలూ ప్రసాద్ యాదవ్ కి అనుకూలంగా నినాదాలు చేయడంతో నితీష్ కుమార్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటీ నాన్సెన్స్ అంటూ ఆయన  రెచ్చి పోయారు.