తల్లిదండ్రుల చెంతకు పాకిస్థాన్ సిక్కు యువతి..

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2019 | 9:05 AM

పాకిస్థాన్‌లో మిస్ అయిన ఓ సిక్కు యువతి ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ సిక్కు అమ్మాయి కొద్ది రోజుల క్రితం తప్పిపోయింది. కొన్ని రోజుల క్రితం జగ్జీర్ కౌర్‌ అనే సిక్కు అమ్మాయిని కిడ్నాప్ చేసి.. మతం మార్పిడి చేయించి బలవంతంగా ఇస్లాం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయేషాగా అమె పేరు మార్చారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో గుర్తించిన పోలీసులు కౌర్ ఆచూకీని తెలుసుకున్నారు. బాధితురాలు […]

తల్లిదండ్రుల చెంతకు పాకిస్థాన్ సిక్కు యువతి..
Follow us on

పాకిస్థాన్‌లో మిస్ అయిన ఓ సిక్కు యువతి ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ సిక్కు అమ్మాయి కొద్ది రోజుల క్రితం తప్పిపోయింది. కొన్ని రోజుల క్రితం జగ్జీర్ కౌర్‌ అనే సిక్కు అమ్మాయిని కిడ్నాప్ చేసి.. మతం మార్పిడి చేయించి బలవంతంగా ఇస్లాం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయేషాగా అమె పేరు మార్చారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో గుర్తించిన పోలీసులు కౌర్ ఆచూకీని తెలుసుకున్నారు. బాధితురాలు గురుద్వారా నన్కానా సాహిబ్ అనే సిక్కు మత పెద్ద కూతురు. ఓ ముస్లిం గ్యాంగ్ ఆమె కిడ్నాప్ చేశారు. అయితే దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి కిడ్నాప్ కు పాల్పడిన 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ ఘటన పై పంజాబ్ సీఎం సర్దార్ ఉస్మాన్ బజ్దార్ దర్యాప్తుకు ఆదేశించారు.