దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి 39,118 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 11,709 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండస్ ఇండ్బ్యాంక్, పవర్ గ్రిడ్, వేదాంతా, హెచ్సీఎల్ టెక్ వంటి షేర్లు లాభపడ్డాయి.