నేషనల్ డిఫెన్స్ ఫండ్ నుంచి సైనికుల పిల్లలకు స్కాలర్షిప్ అందుతోందన్నారు రాష్ట్రపతి. 2022లో భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించనున్నదని, ఇది గర్వకారణమైన విషయమన్నారు. భవిష్యత్తు తరాల కోసం నీటిని నిల్వా చేసుకోవాల్సిన అవసరం ఉందని, దీని కోసం జల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామన్నారు.