
Sanjay Dutt and Suniel Shetty come forward to help Mumbai’s dabbawalas: ముంబైలో డబ్బావాలాలు బాగా ఫేమస్. ఆర్ధిక రాజధానిలో ఉండే దాదాపు రెండు లక్షల మంది ఈ డబ్బావాలాల మీద ఆధారపడి ఉంటారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వీరి జీవితాలు కష్టాల్లో పడ్డాయి. ఇక ఈ విషయాన్ని గమనించిన నటుడు సంజయ్ దత్ మంత్రి అస్లాం షేక్తో కలిసి దాదాపు 5000 మంది డబ్బావాలాలకు ఆహారం అందజేసే బాధ్యతను తీసుకున్నారు.
అటు మున్నాభాయ్ చేసిన ఈ మంచి పనిని ఆదర్శంగా తీసుకుని నటుడు సునీల్ శెట్టి కూడా డబ్బావాలాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. పూణేలోని ఒక క్యాంప్లో ఉంటున్న 800 మంది డబ్బావాలాలకు అవసరమైన నిత్యావసరాలను, ఆహారాన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి అందజేశారు. డబ్బావాలాలకు మరో మూడు నెలల పాటు వీరు ఇరువురూ కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read:
ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..
వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..
హైదరాబాద్లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!
సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!
సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!
జేఈఈ అడ్వాన్స్డ్ .. ఇంటర్లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..