బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..

భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఆర్టీజీఎస్‌ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..

Updated on: Dec 13, 2020 | 12:47 PM

RTGS 24 Hours From Tonight: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌’ ఆర్టీజీఎస్‌ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇది డిసెంబరు 14 నుంచి 24*7 అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పనిదినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లావాదేవీలు చేసుకునేందుకు అవకాశముంది. సుమారు రూ. 2 లక్షల కంటే పెద్ద మొత్తంలో నగదును బదిలీ చేసేందుకు ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఆర్బీఐ కస్టమర్లను సూచించింది. ఆర్టీజీఎస్‌లో లావాదేవీలు అప్పటికప్పుడు క్షణాల్లో పూర్తవుతాయి.

Also Read:

‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్ శర్మ.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న హిట్‌మ్యాన్..

మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..