సమ్మెకు రెమెడీ.. బస్ ఛార్జీల పెంపే..

| Edited By:

May 10, 2019 | 4:37 PM

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెసైరన్ మోగించడంతో యాజమాన్యం సమ్మె నివారణ చర్యలు ప్రారంభించింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు సంస్థ ఎండీ సురేంద్ర బాబు. నిన్ననే కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయని తెలిపారాయన. కార్మికుల సమస్యలను, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీకి గత ఏడాది 6వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు సురేంద్రబాబు. 3,350 కోట్లు అప్పు ఉందని, […]

సమ్మెకు రెమెడీ.. బస్ ఛార్జీల పెంపే..
Follow us on

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెసైరన్ మోగించడంతో యాజమాన్యం సమ్మె నివారణ చర్యలు ప్రారంభించింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు సంస్థ ఎండీ సురేంద్ర బాబు. నిన్ననే కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయని తెలిపారాయన. కార్మికుల సమస్యలను, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

ఏపీఎస్ ఆర్టీసీకి గత ఏడాది 6వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు సురేంద్రబాబు. 3,350 కోట్లు అప్పు ఉందని, ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం మరో 3 వేల కోట్లు ఉందని చెప్పారు. గడిచిన మూడేళ్ళుగా డీజిల్ ధరలు 40 శాతం పెరిగినా ఛార్జీలు పెంచలేదన్నారు. ఛార్జీలు పెంచితేనే లాభనష్టాలు లేకుండా బస్సులను పెంచగలుగుతామని తెలిపారు ఎండీ. కార్మికుల సహకారంతోనే గడిచిన ఐదేళ్ల నుంచి సంస్థ సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతున్నామని వివరించారు సురేంద్రబాబు.