Crime News: చిత్తూరులో రూ.10 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

|

Nov 01, 2021 | 1:03 PM

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల అక్రమ మద్యాన్ని..

Crime News:  చిత్తూరులో రూ.10 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Follow us on

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు… అక్రమ మద్యం సరఫరా గురించి సమాచారం అందుకున్న చిత్తూరు తాలుకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. వారి నుంచి రూ. 10లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన మంజునాథ్, సోమశేఖర్,ప్రసన్నలుగా గుర్తించారు. పారిపోయిన వారిని కుమార్, చక్రిలుగా గుర్తించారు.

చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాలైన పలమనేరు, కుప్పం, చిత్తూరు నియోజక వర్గాల్లో విచ్చల విడిగా కర్ణాటక మద్యం విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నా అక్రమ మద్యం సరఫరా మాత్రం ఆగడం లేదు.

Also Read:

Police Over Action: ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా?.. ఐస్‌క్రీమ్ వెండర్‌పై లాఠీతో పోలీస్ జులుం.. వీడియో వైరల్‌తో నెటిజన్ల ఫైర్!

Farmhouse Casino: ఫామ్‌హౌస్‌ క్యాసినో కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో అసలు కళావర్ కింగ్, ఇస్పేట్ రాజా..!

Vijayawada Murder: మరోసారి ఉలిక్కిపడిన బెజవాడ.. బిల్డర్‌ను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..