ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్…

|

Aug 10, 2020 | 7:52 PM

క‌రోనా దెబ్బకు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్‌ను యూఏఈ కేంద్రంగా నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్పిందని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్..

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్...
Follow us on

Received Govt Approvals for IPL in UAE : క్రికెట్ ప్రియులకు శుభవార్త లభించింది. ఐపీఎల్ 2020ని దుబాయిలో నిర్వహించుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. క‌రోనా దెబ్బకు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్‌ను యూఏఈ కేంద్రంగా నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్పిందని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్ తెలిపారు. యూఏఈలోని షార్జా, దుబాయ్‌, అబుదాబీలో సెప్టెంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఐపీఎల్ సీజ‌న్ నిర్వ‌హించ‌నున్న‌విష‌యం తెలిసిందే.

ప్ర‌భుత్వం నుంచి లిఖిత పూర్వ‌కంగా అనుమ‌తి లభించిందని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నుంచి హామీ అందిన వెంట‌నే లీగ్‌ను యూఏఈలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు స‌మాచార‌మిచ్చామని.. ఇప్పుడు అధికారికంగా ప‌త్రాలు కూడా అందిస్తామని బ్రిజేశ్ ప‌టేల్ తెలిపారు. ఇప్ప‌టికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు యూఏఈ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండ‌గా.. కొవిడ్‌-19 నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌ల మ‌ధ్యే లీగ్ నిర్వ‌హించాల‌ని మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.