కరోనా ఎఫెక్ట్: కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత!

కోవిద్-19 విజృంభిస్తోంది. తాజాగా భారత్ లో కరోనా కేసులు లక్ష దాటాయి. ఈ కరోనా సెగ.. కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కార్యాలయాన్ని తాకింది. సెంట్రల్‌ ఢిల్లీలోని కృషి భవన్‌లో ఆయన

కరోనా ఎఫెక్ట్: కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత!

Edited By:

Updated on: May 19, 2020 | 1:32 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. తాజాగా భారత్ లో కరోనా కేసులు లక్ష దాటాయి. ఈ కరోనా సెగ.. కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కార్యాలయాన్ని తాకింది. సెంట్రల్‌ ఢిల్లీలోని కృషి భవన్‌లో ఆయన ఆధ్వర్యంలోని ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా.. శానిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టడం కోసం మే 19, 20 తేదీల్లో కార్యాలయాన్ని మూసివేయనున్నట్టుగా తెలిపారు. కాగా, ప్రస్తుతం రాంవిలాస్‌ పాశ్వాన్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలు ఉన్న సంగతి విదితమే. గత నెల 28న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నీతి ఆయోగ్‌ కార్యాలయాన్ని మూసివేసి.. శానిటైజన్‌ ప్రక్రియ చేపట్టారు.

Also Read: గుడ్ న్యూస్: కరోనాపై పోరులో మరో ముందడుగు.. ట్రయల్స్ సక్సెస్!