పెళ్లయిన మూడు రోజులకే..

| Edited By:

Jul 01, 2019 | 7:30 AM

రాజస్థాన్‌లోని కోటాలో పెళ్లైన మూడు రోజులకు ఓ వధువు కిడ్నాప్‌కు గురైంది. దీంతో ఆమె తండ్రి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. మేఘవాల్ అనే యువతికి జూన్ 25న ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత వారి పెళ్లికి సంబంధించిన పత్రాలను తీసుకుని వివాహ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి వస్తున్న సమయంలో ఇమ్రాన్ అనే యువకుడు వారిని కలిశాడు. మేఘవాల్‌తో కొంచెం పర్సనల్‌గా మాట్లాడే పని ఉందని చెప్పాడు. తరువాత ఆమెను కిడ్నాప్ చేశాడు. […]

పెళ్లయిన మూడు రోజులకే..
Follow us on

రాజస్థాన్‌లోని కోటాలో పెళ్లైన మూడు రోజులకు ఓ వధువు కిడ్నాప్‌కు గురైంది. దీంతో ఆమె తండ్రి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. మేఘవాల్ అనే యువతికి జూన్ 25న ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత వారి పెళ్లికి సంబంధించిన పత్రాలను తీసుకుని వివాహ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి వస్తున్న సమయంలో ఇమ్రాన్ అనే యువకుడు వారిని కలిశాడు. మేఘవాల్‌తో కొంచెం పర్సనల్‌గా మాట్లాడే పని ఉందని చెప్పాడు. తరువాత ఆమెను కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుమార్తె విషయం తెలిసిన వెంటనే ఆమె తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే, భిల్వారా జిల్లాలో పోలీసులు ఇమ్రాన్, మేఘవాల్‌ను పట్టుకున్నారు. ఇమ్రాన్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసు నమోదు చేశారు.