క్యూనెట్ కంపెనీకి ప్రమోషన్ చేసిన ఏడుగురు సెలబ్రెటీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిలో.. అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ఫ్రాఫ్, పూజాహెగ్దే, షారుఖ్ ఖాన్లకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్యూనెట్ సంస్థ భారీ మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఈ సంస్థపై 15 కేసులు నమోదయ్యాయి. కాగా.. దేశవ్యాప్తంగా కూడా లక్షల్లో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా.. హైదరాబాద్లో క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరవింద్.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్యూనెట్లో రూ.20 లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. దీంతో.. అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు క్యూనెట్కు ప్రమోటర్లుగా వ్యవహరించిన 500 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈ కంపెనీకి ప్రమోషన్ చేసే సెలబ్రెటీలకు కూడా నోటీసులిచ్చారు.