ప్రజలకు నా ధన్యవాదాలు..! : మోదీ

| Edited By:

May 27, 2019 | 3:29 PM

ప్రధాని మోదీ ఇవాళ వారణాసిలో పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారి వారణాసికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి 4 లక్షల 79వేల భారీ మెజార్టీతో మోదీ గెలుపొందారు. ఈ క్రమంలో తనపై నమ్మకం ఉంచి ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. అలాగే.. కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వారణాసికి చేరుకున్న మోదీ.. పోలీస్ లైన్స్ నుంచి బన్స్‌ఫటక్ వరకు […]

ప్రజలకు నా ధన్యవాదాలు..! : మోదీ
Follow us on

ప్రధాని మోదీ ఇవాళ వారణాసిలో పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారి వారణాసికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి 4 లక్షల 79వేల భారీ మెజార్టీతో మోదీ గెలుపొందారు. ఈ క్రమంలో తనపై నమ్మకం ఉంచి ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. అలాగే.. కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వారణాసికి చేరుకున్న మోదీ.. పోలీస్ లైన్స్ నుంచి బన్స్‌ఫటక్ వరకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. 5 కిలోమీటర్ల వరకు జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని వారణాసి రాక సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మోదీ మాట్లడుతూ.. నేను ఈ సారి ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా ఉన్నానని, ఇలా ఉండటం చాలా అరుదని పేర్కొన్నారు. మీ విశ్వాసంతోనే నేను మళ్లీ మీ ముందు ఇలా నిలుచున్నా అని అన్నారు. ముందు నేను మీ సేవకుడిని, ఆ తర్వాతే.. ప్రధాని అని చెప్పారు. నాకు వారణాసి ప్రజలపై పూర్తి నమ్మకం ఉందని, అందుకే అంత ధీమాగా కేధార్‌నాథ్ వెళ్లి వచ్చానని పేర్కొన్నారు. 2014, 2017, 2019 ఎన్నికల్లో నేను వరసగా హ్యట్రిక్ సాధించడం చిన్న విషయం కాదన్నారు. ఇంత జరిగినా కొంతమంది రాజకీయ పండితులు ఇంకా కళ్లు తెరుచుకోవడంలేదని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.