హోటల్ బిల్లు కట్టకుండా పారిపోయిన పూజా గాంధీ

| Edited By:

Mar 19, 2019 | 7:00 PM

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీపై పోలీస్ కేసు నమోదయ్యింది. బిల్లు కట్టకుండా హోటల్‌ నుంచి పారిపోవడంతో ఆవిడపై హోటల్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేసింది. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో ఆమె కొన్ని రోజులు బస చేశారు. బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న ఆమె పూర్తిగా చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారట. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. అయితే రూ. 2లక్షలు చెల్లించానని పూజా పోలీసులతో అన్నట్లు తెలిసింది. […]

హోటల్ బిల్లు కట్టకుండా పారిపోయిన పూజా గాంధీ
Follow us on

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీపై పోలీస్ కేసు నమోదయ్యింది. బిల్లు కట్టకుండా హోటల్‌ నుంచి పారిపోవడంతో ఆవిడపై హోటల్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేసింది. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో ఆమె కొన్ని రోజులు బస చేశారు. బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న ఆమె పూర్తిగా చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారట. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. అయితే రూ. 2లక్షలు చెల్లించానని పూజా పోలీసులతో అన్నట్లు తెలిసింది. మొత్తం డబ్బు చెల్లించేందుకు కాస్త సమయం ఇవ్వమని హోటల్‌ యాజమాన్యాన్ని నటి కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు కొన్ని రోజులు గడువు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే గత కొంతకాలంగా పూజా పైనాన్సియల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. సినిమాలలో అవకాశాలు తగ్గడంతో..మనీ ప్రాబ్లమ్స్ చుట్టుముట్టినట్టు సమాచారం. పూజా 2002లో హిందీ సినిమా ‘దుష్మ‌ని’తో నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత దాదాపు 30 కన్నడ చిత్రాల్లో నటించారు. ‘దండుపాళ్యం’ సినిమాతో ఆవిడ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.