AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ ఏజెన్సీలో మూడో కన్ను..

విశాఖపట్నం ఏవోబీలో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టు వారోత్సవాలతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. పెద్ద ఎత్తున కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల కదలికలను తెలుసుకునేందుకు డ్రోన్లతో నిఘా పెట్టారు.

విశాఖ ఏజెన్సీలో మూడో కన్ను..
Sanjay Kasula
|

Updated on: Sep 24, 2020 | 2:10 PM

Share

విశాఖపట్నం ఏవోబీలో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టు వారోత్సవాలతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. పెద్ద ఎత్తున కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల కదలికలను తెలుసుకునేందుకు డ్రోన్లతో నిఘా పెట్టారు.

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పాడేరు, ముంచంగిపుట్టు, పెదబయలులో బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. మావోయిస్టుల కదలికలను పసిగట్టి… వాళ్లకు చెక్‌ పెట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు విజయవంతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఓవైపు… వారి ప్లాన్‌ను తిప్పికొట్టేందుకు పోలీసుల బలగాలు మరోవైపు. దీంతో ఏజెన్సీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ కొనసాగుతోంది. విశాఖలోని పాడేరు, మంచంగిపుట్టు, పెదబయలు ప్రాంతాల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసు బలగాలు…ఎక్కడిక్కడ తనిఖీలు జరుపుతున్నారు. స్థానికుల వివరాలు సేకరిస్తూనే.. అనుమానితులు, సానుభూతిపరుల్ని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే తమకు సమాచారం అందించాలని స్థానికులకు పోలీసులు సూచిస్తున్నారు.