గర్బం దాల్చిన కూతురిని అమ్మిన కసాయి తండ్రి..!

|

Jun 19, 2020 | 9:51 PM

వడోదరా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ బాలిక అంగట్లో ఆట వస్తువులా మారింది. రూ.50 వేలకు కన్న కూతురిని అమ్మేశాడు. తనకి మరో ఐదు లక్షలు కావాలంటూ డిమాండ్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడని వికాస్.. బాలికను పుట్టింటికి వెల్లగొట్టాడు.

గర్బం దాల్చిన కూతురిని అమ్మిన కసాయి తండ్రి..!
Follow us on

గుజరాత్ లో దారుణం జరిగింది. గర్భంతో ఉన్న కన్న కూతుర్ని అంగట్లో బొమ్మను చేసి నిలువునా అమ్మేశాడు కసాయి తండ్రి. మరిన్ని డబ్బు కోసం వేధిస్తుండడంతో భరించలేక బాలికను పుట్టింటికి వెళ్లిపొమ్మని బయటకు నెట్టేశాడు ఆవ్యక్తి. దిక్కుతోచని స్థితిలో పడ్డ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

వడోదరా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ బాలిక అంగట్లో ఆట వస్తువులా మారింది. రూ.50 వేలకు కన్న కూతురిని అమ్మేశాడు. మైనర్ బాలిక ప్రియుడి మాయమాటలకు లొంగిపోయింది. పెళ్లి కాకుండానే హద్దులు దాటి, గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. కూతురిని అంగట్లో బొమ్మను చేసి నిలువునా అమ్మేశాడు. గర్భిణి అయిన కూతురిని ఆమె ప్రియుడు వికాస్ వసవాకి రూ.50 వేలకు విక్రయించాడు. తానంటే ఆమెకి కూడా ఇష్టం కావడంతో ఇందుకు అంగీకరించింది.

అయితే, కొద్ది రోజులు బాగానే ఉంది. ఇంతలో బాలిక బంధువు ఒకరు డబ్బులు సరిపోలేదంటూ ఇంకా డబ్బు కావాలంటూ తండ్రిని రెచ్చగొట్టాడు. ఆమె మైనర్ కావడం కలిసోస్తుందని కూతురి ప్రియుడిని వేధించడం మొదలుపెట్టాడు. తనకి మరో ఐదు లక్షలు కావాలంటూ డిమాండ్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడని వికాస్.. బాలికను పుట్టింటికి వెల్లగొట్టాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లిదండ్రులతో సహా ప్రియుడిని అరెస్టు చేశారు.