AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయంకర కరోనా విజృంభణ.. చైనాలో 100 మందికి పైగా మృతి

కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్‌ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది. చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా […]

భయంకర కరోనా విజృంభణ.. చైనాలో 100 మందికి పైగా మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 28, 2020 | 1:46 PM

Share

కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్‌ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది.

చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. ప్రపంచదేశాలకూ విస్తరిస్తోంది. చైనా వారిని వారి దేశాలకు రాకుండా.. వివిధ దేశాలు బ్యాన్ విధించాయి. తాజాగా.. థాయ్‌లాండ్‌లో 7కి, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో 4కి, అమెరికాలో 3కి, జపాన్, మలేషియా, ఫ్రాన్స్ దేశాల్లో ఒక్కొక్కరికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే.. చైనా నుంచి ఇండియాకి వస్తోన్న వారిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఈ వైరస్ లక్షణాలు లేనివారిని అనుమతిస్తున్నారు.

కాగా.. చైనా నుంచి ఇటీవలే ఓ బీహార్‌ యువతి భారత్‌కు తిరిగి వచ్చించి. 29 సంవత్సరాలున్న ఈమె చైనాలో పీహెచ్‌డీ చేసింది. ఈమె తండ్రి బీహార్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఈ యువతి వచ్చిన రెండు రోజుల తర్వాత  దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని పూణెలోని ఆమె సోదరి వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు హెల్ప్‌లైన్‌ ద్వారా తెలియచేశారు. అమె కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు జరపాలని బీహార్‌ ఆరోగ్య శాఖ ఆదేశించింది.