AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయంకర కరోనా విజృంభణ.. చైనాలో 100 మందికి పైగా మృతి

కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్‌ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది. చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా […]

భయంకర కరోనా విజృంభణ.. చైనాలో 100 మందికి పైగా మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 28, 2020 | 1:46 PM

Share

కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్‌ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది.

చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. ప్రపంచదేశాలకూ విస్తరిస్తోంది. చైనా వారిని వారి దేశాలకు రాకుండా.. వివిధ దేశాలు బ్యాన్ విధించాయి. తాజాగా.. థాయ్‌లాండ్‌లో 7కి, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో 4కి, అమెరికాలో 3కి, జపాన్, మలేషియా, ఫ్రాన్స్ దేశాల్లో ఒక్కొక్కరికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే.. చైనా నుంచి ఇండియాకి వస్తోన్న వారిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఈ వైరస్ లక్షణాలు లేనివారిని అనుమతిస్తున్నారు.

కాగా.. చైనా నుంచి ఇటీవలే ఓ బీహార్‌ యువతి భారత్‌కు తిరిగి వచ్చించి. 29 సంవత్సరాలున్న ఈమె చైనాలో పీహెచ్‌డీ చేసింది. ఈమె తండ్రి బీహార్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఈ యువతి వచ్చిన రెండు రోజుల తర్వాత  దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని పూణెలోని ఆమె సోదరి వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు హెల్ప్‌లైన్‌ ద్వారా తెలియచేశారు. అమె కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు జరపాలని బీహార్‌ ఆరోగ్య శాఖ ఆదేశించింది.

Follow Us
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ