మహాసంగ్రామంలో కాషాయ పార్టీలు కలుస్తాయా.. కలబడతాయా..?

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆర్నెల్లు కూడా గడవలేదు.. అప్పుడే మిని సంగ్రామాని కమల దళం రెడీ అవుతోంది. మహారాష్ట్ర, హరియాణాలతోపాటు ఢిల్లీ, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీపావళి పండుగకు ముందే.. మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. వీటికి సంబంధించి ఇవాళ నోటీఫికేషన్ కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే మరి ఇప్పుడు జరగబోయే […]

మహాసంగ్రామంలో కాషాయ పార్టీలు కలుస్తాయా.. కలబడతాయా..?
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2019 | 3:53 AM

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆర్నెల్లు కూడా గడవలేదు.. అప్పుడే మిని సంగ్రామాని కమల దళం రెడీ అవుతోంది. మహారాష్ట్ర, హరియాణాలతోపాటు ఢిల్లీ, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీపావళి పండుగకు ముందే.. మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. వీటికి సంబంధించి ఇవాళ నోటీఫికేషన్ కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే మరి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఎంటన్న చర్చ మొదలైంది. రెండు కూడా హిందుత్వ ఓటు బ్యాంకుతో కూడిన పార్టీలు కావడంతో.. ఈ ఇరు పార్టీల మధ్య పొత్తు ప్రతీ సారి ఆసక్తి రేపుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని అంతా భావించినా.. చివరి క్షణంలో ఎవరికి వారే బరిలోకి దిగారు. ఆ తర్వాత బీజేపీ అధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. అయితే ఆ తర్వాత మళ్లీ శివసేన, బీజేపీల మధ్య స్నేహం కుదిరింది. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపించే వేళ.. శివసేన చీఫ్ బీజేపీపై విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అమిత్ షా రంగంలోకి దిగడంతో సీన్ ఛేంజ్ అయ్యింది. అమిత్ షా.. సీఎం ఫడ్నవీస్.. ఉద్దవ్ ఠాకూర్‌తో కలిసి భేటీ అయ్యారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. మొత్తం 48 సీట్లలో బీజేపీ 25, శివసేన 23 స్థానాలను పంచుకున్నాయి. అయితే ఆ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన కూడా పార్టీ శ్రేణుల్లో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 50-50 శాతం సీట్ల పంపకాలు ఉండేలా చూడాలని నిర్ణయించుకున్నారు. అయితే అనుకున్నట్లే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. అయితే ఇప్పుడు కాషాయ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా..? లేక కలబడనున్నాయా..? అన్నదానిపై ఉత్కంఠ రేగుతోంది.

అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోతుందని శివసేన కార్యదర్శి అనిల్ దేశాయి తెలిపారు. సెప్టెంబరు 22న భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ముంబయికి రానున్నారని, ఈ సందర్భంగా పొత్తు ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అనిల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఎన్నికల పొత్తు విషయమై శివసేన ఇప్పటికే ఓ రాజీ ఫార్ములాను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను, శివసేన 135 సీట్లలో పోటీ చేయనుంది. ఇక బీజేపీ 153 సీట్లలో పోటీకి దిగనుంది. అయితే బీజేపీకి 153 సీట్లు కేటాయించినా.. ఆ సీట్లలో 18 స్థానాలను కూటమిలోని చిన్న పార్టీలైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా,రాష్ట్రీయ సమాజ్ పక్షా, శివ సంగ్రామ్‌ పార్టీలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా ప్రకారం రెండు పార్టీలు చెరో 135 సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫార్ములాతో పాటు.. మరోవైపు అసలు పొత్తులు కుదరకపోతే అప్పుడు ఉం చేయాలన్న దానిపై కూడా ప్లాన్లు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన సీన్ రిపీట్ అయితే.. అప్పుడు అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సి వస్తుంది. మరి అప్పుడు 288 మంది అభ్యర్థులను ఎవరెవరిని బరిలో దింపాలన్నదానిపై కూడా ప్లాన్లు వేస్తున్నారని తెలుస్తోంది.

అయితే శివసేన కీలక నేతల్లో ద్వందాభిప్రాయాలున్నాయి. ఒకరు 50-50 ఒప్పదం ఉండాలనుకుంటుంటే.. మరోకరు సగానికి పైగా సీట్లను శివసేనాకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటు బీజేపీ నేతలు కొందరు ఒంటరిగా పోటీ దిగాలన్న అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. గత అయిదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిందని.. కాబట్టి ప్రజాక్షేత్రంలో సత్తా చాటొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు పొత్తు కుదురుతుందా.. లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?