పుల్వామా ఘటనపై విమర్శలు, విపక్షాల అపాలజీకి బీజేపీ డిమాండ్

| Edited By: Anil kumar poka

Oct 31, 2020 | 2:09 PM

పుల్వామా  దాడిపై విమర్శలు చేస్తూ, అనుమానాలు వ్యక్తం చేసినందుకు విపక్షాలు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఎటాక్ నేపథ్యంలో వారు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు.

పుల్వామా ఘటనపై విమర్శలు, విపక్షాల అపాలజీకి బీజేపీ డిమాండ్
Follow us on

పుల్వామా  దాడిపై విమర్శలు చేస్తూ, అనుమానాలు వ్యక్తం చేసినందుకు విపక్షాలు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఎటాక్ నేపథ్యంలో వారు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటన ఎవరికి ప్రయోజనకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని, బాలాకోట్ లో జైషే మహమ్మద్ శిక్షణా శిబిరాల మీద భారత జవాన్ల బాంబు దాడులపైనా అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ మంత్రి ఒకరు బాహాటంగా అంగీకరించినా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందనే కరువైందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఇండియాలో ఉగ్రదాడులకు పాకిస్థానే కారణమని విపక్షాలు నమ్ముతున్నాయా లేదా అని ఆయన ప్రశ్నించారు. . టెర్రరిస్టు దాడుల వెనుక కుట్ర దాగి ఉందన్న వ్యాఖ్యకు రాహుల్, ఇతర ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా డిమాండ్ చేశారు.