గొర్రెల కాపరితో దోవల్ ఏం మాట్లాడారు?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం షోపియాన్లో స్థానికులతో మాట్లాడిన దోవల్ తాజాగా అనంత్నాగ్ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై వెళుతుండగా గొర్రెల వ్యాపారులను చూసి, ఆగి వారితో కాసేపు ముచ్చటించారు. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఓ యువకుడిని అడిగారు […]

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం షోపియాన్లో స్థానికులతో మాట్లాడిన దోవల్ తాజాగా అనంత్నాగ్ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు.
రోడ్డుపై వెళుతుండగా గొర్రెల వ్యాపారులను చూసి, ఆగి వారితో కాసేపు ముచ్చటించారు. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఓ యువకుడిని అడిగారు దోవల్. అందుకు సమాధానంగా కార్గిల్, ద్రాస్ నుంచి తీసుకొచ్చాం అని చెప్పిన అతను.. మీకు ద్రాస్ ఎక్కడ ఉంటుందో తెలుసా? అని దోవల్ను తిరిగి ప్రశ్నించాడు. అనంత్నాగ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఖలీద్ జనగిర్ కలగజేసుకొని దోవల్ గురించి అతనికి వివరించారు.
ANANTNAG: National Security Advisor Ajit Doval interacts with locals in Anantnag, an area which has been a hotbed of terrorist activities in the past. #JammuAndKashmir pic.twitter.com/dUd7GPvS2W
— ANI (@ANI) August 10, 2019