శ్రీనగర్ కు మళ్లీ దోవల్… ఈసారి ఏంచేయబోతున్నారంటే..?

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్ పర్యటన పై ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొద్ది రోజుల పాటు కశ్మీర్‌లో ఉండి అక్కడి పరిస్థితులు సమీక్షించిన ఆయన.. మళ్లీ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రణాళికలు సజావుగా అమలయ్యేలా భవిష్యత్ కార్యచరణను నిర్ణయించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే మళ్లీ ఉగ్రవాదుల చొరబాటు, పీవోకేను స్వాధీనం చేసుకుంటామని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో.. అజిత్ దోవల్ కశ్మీర్ వచ్చారా..? లేదా కేంద్రం […]

శ్రీనగర్ కు మళ్లీ దోవల్... ఈసారి ఏంచేయబోతున్నారంటే..?

Updated on: Sep 26, 2019 | 9:31 AM

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్ పర్యటన పై ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొద్ది రోజుల పాటు కశ్మీర్‌లో ఉండి అక్కడి పరిస్థితులు సమీక్షించిన ఆయన.. మళ్లీ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రణాళికలు సజావుగా అమలయ్యేలా భవిష్యత్ కార్యచరణను నిర్ణయించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే మళ్లీ ఉగ్రవాదుల చొరబాటు, పీవోకేను స్వాధీనం చేసుకుంటామని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో.. అజిత్ దోవల్ కశ్మీర్ వచ్చారా..? లేదా కేంద్రం మళ్లీ ఏదైనా చర్య తీసుకుంటుందా అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఆగస్టు 5 నుంచి 11 రోజులపాటు కశ్మీర్‌లో మకాం వేసిన దోవల్. ఆ సమయంలో సోషియన్ పట్టణం, శ్రీనగర్ వీధుల్లో తిరిగారు. జమ్ముకశ్మీర్, సీఆర్పీఎఫ్ బలగాలు, ఆర్మీని ఉద్దేశిస్తూ ప్రత్యేకంగా మాట్లాడారు కూడా. ఆ సమయంలో అక్కడి పరిస్థితిని పరిశీలించిన ఆయన.. ఎలాంటి గొడవలు జరగలేదని, ప్రశాంత వాతావరణమే ఉందని ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం అందించారు. ఆయన ఆధ్వర్యంలోనే కశ్మీర్ విభజన తర్వాత కూడా ఎలాంటి అలజడి లేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదులు, పాకిస్థాన్ దాడులు చేస్తోందా అనే అనుమానంతో భారీగా బలగాలను కేంద్ర ప్రభుత్వం మొహరించింది. 40 వేలకు పైగా సిబ్బంది కశ్మీర్ వీధుల్లో గస్తీ కాస్తున్నారు. గతంలో రాళ్లతో విరుచుకుపడే మూకలు తోకముడిచి పోయారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యే స్థానికులు కూడా విద్య లేదంటే పని బాట పడుతున్నారు. మొత్తంగా కశ్మీర్ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us