తమిళనాడును తాకిన ఈశాన్య రుతుప‌వ‌నాలు

|

Oct 28, 2020 | 9:28 PM

Northeast Monsoons Hit : నైరుతి రుతుప‌వ‌నాలు బ‌ల‌హీన‌ప‌డిన మ‌రు క్ష‌ణ‌మే ఈశాన్య రుతుప‌వ‌నాలు త‌మిళ‌నాడు రాష్ర్టాన్ని తాకాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌తో పాటు ద‌క్షిణ ద్వీప‌క‌ల్ప ప్రాంతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు చేరుకున్నాయి. ప్ర‌స్తుతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ త్వ‌ర‌లోనే బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావ‌ర‌ణ శాఖ(IMD) వెల్ల‌డించింది. ఈ రుతుప‌వనాల రాక నేప‌థ్యంలో నేటి నుంచి డిసెంబ‌ర్ చివ‌రి నాటికి 44 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని అంచన వేస్తున్నారు. ఇదే అంశంపై […]

తమిళనాడును తాకిన ఈశాన్య రుతుప‌వ‌నాలు
Follow us on

Northeast Monsoons Hit : నైరుతి రుతుప‌వ‌నాలు బ‌ల‌హీన‌ప‌డిన మ‌రు క్ష‌ణ‌మే ఈశాన్య రుతుప‌వ‌నాలు త‌మిళ‌నాడు రాష్ర్టాన్ని తాకాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌తో పాటు ద‌క్షిణ ద్వీప‌క‌ల్ప ప్రాంతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు చేరుకున్నాయి.

ప్ర‌స్తుతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ త్వ‌ర‌లోనే బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావ‌ర‌ణ శాఖ(IMD) వెల్ల‌డించింది. ఈ రుతుప‌వనాల రాక నేప‌థ్యంలో నేటి నుంచి డిసెంబ‌ర్ చివ‌రి నాటికి 44 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని అంచన వేస్తున్నారు.

ఇదే అంశంపై చెన్నై వాతావరణ శాఖ పలు వివరాలను వెల్లడించింది. ద‌క్షిణ త‌మిళ‌నాడుతో పాటు తీర ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు ప‌డ్డాయని తెలిపింది. మ‌ధురై జిల్లాలోని మేలూరులో 6 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో ఇదే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం అని పేర్కొంది. చెన్నై జిల్లాలోని నుంగంబ‌క్కం, సోలింగ‌న‌ల్లూరులో 1 సెంటిమీట‌ర్ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని తమ రిపోర్టులో వెల్లడించింది.